26 వరకు ఓటు దరఖాస్తుల పరిశీలన
ABN , Publish Date - Dec 14 , 2023 | 12:38 AM
జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు - చేర్పుల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఈనెల 26వ తేదీ వరకు జరుగుతుందని డీఆర్వో రాజశేఖర్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 13: జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు - చేర్పుల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన ఈనెల 26వ తేదీ వరకు జరుగుతుందని డీఆర్వో రాజశేఖర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. కొత్తగా అందిన ఓటరు కార్డులు తపాలా కార్యాలయం నుంచి నేరుగా ఓటర్ల చిరునామాలకు వెళతాయని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు సురేంద్రకుమార్ (టీడీపీ), ఉదయ్కుమార్ (వైసీపీ), అట్లూరి శ్రీనివాసులు (బీజేపీ), పరదేశి (కాంగ్రెస్), భాస్కర్ (బీఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.