ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2023-03-02T23:54:55+05:30 IST

ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను గురువారం మధ్యాహ్నం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌, జేసీ వెంకటేశ్వర్‌, ఏఎస్పీ జగదీష్‌ పరిశీలించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన
ఆర్వీఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో గదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 2: ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను గురువారం మధ్యాహ్నం రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌, జేసీ వెంకటేశ్వర్‌, ఏఎస్పీ జగదీష్‌ పరిశీలించారు. చిత్తూరు - తిరుపతి జాతీయ రహదారిలో ఉన్న ఆర్వీఎస్‌ కళాశాలలో పట్టభద్రుల, లా కాలేజ్‌లో ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగేలా నిర్ణయించారు. రిసెప్షన్‌ సెంటర్‌, స్ట్రాంగ్‌ రూమ్‌లు, టేబుల్స్‌, మెష్‌, పోలీసు బందోబస్తు, బ్యాలెట్‌ బాక్సుల తరలింపు తదితర అంశాలపై కలెక్టర్‌ ఎస్పీతో చర్చించారు. ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన ఏర్పాట్లు చేయాలని చిత్తూరు ఆర్డీవో రేణుకను ఆదేశించారు. వీరివెంట డీఆర్వో రాజశేఖర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ దేవానందం, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, పూతలపట్టు, పెనుమూరు తహసీల్దార్లు విజయభాస్కర్‌, సురేష్‌ బాబు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:54:55+05:30 IST