నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల
ABN , First Publish Date - 2023-06-01T01:24:12+05:30 IST
2023-24 సంవత్సరానికి మొదటి విడత కింద పీఎం కిసాన్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నిధులు విడుదల కానున్నాయి.
చిత్తూరు (సెంట్రల్), మే 31: 2023-24 సంవత్సరానికి మొదటి విడత కింద పీఎం కిసాన్ రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలకు నిధులు విడుదల కానున్నాయి. జిల్లాలోని 2,27,010 మంది రైతుల ఖాతాల్లో రూ.170.84 కోట్లు జమకానున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో మంత్రులు, జడ్పీ ఛైర్మన్తో పాటు ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొంటారని కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.