20 మండలాల్లో వర్షం
ABN , First Publish Date - 2023-09-22T00:40:06+05:30 IST
జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 20 మండలాల్లో వర్షం కురిసింది.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 21: జిల్లాలో బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 20 మండలాల్లో వర్షం కురిసింది. పెనుమూరులో 23.2, పెద్దపంజాణిలో 22.6, గంగవరంలో 21.4, బైరెడ్డిపల్లెలో 18.6, ఐరాలలో 18.2, చౌడేపల్లెలో 17.6, నగరిలో 10.6, గుడిపాలలో 10.4, వెదురుకుప్పంలో 8.2, యాదమరిలో 8.2, పాలసముద్రంలో 8.2, సదుంలో 5.2, సోమలలో 4.6, చిత్తూరులో 4.0, పలమనేరులో 4.0, గంగాధరనెల్లూరులో 3.8, పుంగనూరులో 2.8, పూతలపట్టులో 2.4, రామకుప్పంలో 2.4, శ్రీరంగరాజపురంలో 1.8 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.