18 మండలాల్లో వర్షం
ABN , First Publish Date - 2023-06-01T01:23:07+05:30 IST
అల్పపీడనద్రోణి ప్రభావ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 18 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది.
చిత్తూరు, మే 31: అల్పపీడనద్రోణి ప్రభావ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 18 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. పలమనేరులో 42, విజయపురంలో 35.2, గంగవరంలో 31.8, సోమలలో 28.4, ఐరాలలో 20.4, నిండ్రలో 9.4, వి.కోటలో 9.2, గుడుపల్లెలో 7.2, గుడిపాలలో 7, సదుంలో 6.2, కుప్పంలో 5.2, నగరిలో 2.6, కార్వేటినగరంలో 2.4, చౌడేపల్లెలో 2.0, పులిచెర్లలో 1.4, పాలసముద్రంలో 1.2, పుంగనూరులో 1.0, యాదమరిలో 1.0 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.