చిత్తూరు పీఏవోకు పదోన్నతి

ABN , First Publish Date - 2023-09-22T00:48:17+05:30 IST

చిత్తూరు అసిస్టెంట్‌ పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏ.వెంకట్రమణ పదోన్నతిపై తిరుపతికి బదిలీ అయ్యారు.

చిత్తూరు పీఏవోకు పదోన్నతి

తిరుపతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు అసిస్టెంట్‌ పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఏ.వెంకట్రమణ పదోన్నతిపై తిరుపతికి బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక శాఖ పరిధిలోని పే అండ్‌ అకౌంట్స్‌ (వర్క్‌ అకౌంట్స్‌) విభాగంలో పనిచేస్తున్న ఏడుగురికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అందులో భాగంగా వెంకట్రమణకు పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పదోన్నతి ఇస్తూ తిరుపతిలో ఖాళీగా ఉన్న సంబంధిత పోస్టులో నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-09-22T00:48:17+05:30 IST