చెరువులో విషప్రయోగం

ABN , First Publish Date - 2023-06-03T01:34:44+05:30 IST

పలమనేరు మండలం టి.ఒడ్డూరు సమీపంలోని చెరువులో శుక్రవారం ఉదయం వేలాది చేపలు చనిపోయి గట్టువైపు కొట్టుకొచ్చాయి.

చెరువులో విషప్రయోగం
టి.ఒడ్డూరు చెరువులో చనిపోయిన చేపలు

పలమనేరు, జూన్‌ 2: పలమనేరు మండలం టి.ఒడ్డూరు సమీపంలోని చెరువులో శుక్రవారం ఉదయం వేలాది చేపలు చనిపోయి గట్టువైపు కొట్టుకొచ్చాయి. టి.ఒడ్డూరు చెరువులోని చేపలను ఆ గ్రామానికి చెందిన లోకేశ్‌ వేలం పాటలో రూ.42వేలకు దక్కించుకున్నారు. ఏడాదిపాటు చెరువులో చేపలు పట్టుకునేందుకు ఆయనకు అధికారులు అనుమతిచ్చారు. చెరువులో నీరు ఉండటంతో ఆయన చేపపిల్లలను కొనుగోలు చేసి వదిలారు. గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి చెరువులో విషం కలపడంతో శుక్రవారం ఉదయాన్నే వేలాది చేపలు చనిపోయాయి. దీనిపై సచివాలయ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-06-03T01:34:44+05:30 IST