వక్ఫ్బోర్డు భూముల పరిరక్షణకు చర్యలు
ABN , First Publish Date - 2023-05-02T00:54:08+05:30 IST
వక్ఫ్బోర్డు భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసకుందని వక్ఫ్బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు గఫార్ఖాన్ తెలిపారు.
చిత్తూరు, మే 1: వక్ఫ్బోర్డు భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసకుందని వక్ఫ్బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు గఫార్ఖాన్ తెలిపారు. జిల్లాలో 6200 ఎకరాల వక్ఫ్భూములు ఉన్నాయని, ఇందులో చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణకు ప్రభుత్వం కమిటీలను నియమించడంతో పాటు మైనార్టీ అధికారిని నియమించిందన్నారు. చిత్తూరు నగరం హైరోడ్డులో సర్వే నెంబరు 602-1ఎ, 1బిలో 6,31 ఎకరాల భూమి, పలమనేరులో 393, 963, తదితర సర్వే నెంబర్లలో 17 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్లు తెలిపారు. వీటన్నింటినీ త్వరగా సర్వే చేసి వక్ఫ్బోర్డుకు అప్పగిస్తామన్నారు.