డెప్యుటేషన్‌ని రెగ్యులర్‌ చేస్తూ..!

ABN , First Publish Date - 2023-06-01T01:38:41+05:30 IST

జిల్లాలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్లను, ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లను అదే స్థానాలకు రెగ్యులర్‌ చేస్తూ బుధవారం జేసీ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు.

డెప్యుటేషన్‌ని రెగ్యులర్‌ చేస్తూ..!

చిత్తూరు రూరల్‌, మే 31: జిల్లాలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్లను, ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లను అదే స్థానాలకు రెగ్యులర్‌ చేస్తూ బుధవారం జేసీ శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో డెప్యుటేషన్‌పై ఏవోగా పనిచేస్తున్న తహసీల్దార్‌ ఎం.ప్రసాద్‌ బాబును.. చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న తహసీల్దార్‌ బ్యూలాను అవే స్థానాల్లో రెగ్యులర్‌ చేశారు. డిప్యుటేషన్‌పై చిత్తూరు తహసీల్దారు కార్యాలయంలో ఎలక్షన్‌ డీటీగా పనిచేస్తున్న ఎం.అరుణకుమారి.. నగరి ఆర్డీవో కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న ఎంవీ పయణిని. పలమనేరు ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న డీటీ పి.రమే్‌షను ఆయా స్థానాల్లోనే రెగ్యులర్‌గా నియమిస్తూ జేసీ ఉత్తర్వులిచ్చారు.

Updated Date - 2023-06-01T01:38:41+05:30 IST