9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’
ABN , First Publish Date - 2023-05-02T01:05:35+05:30 IST
జిల్లాలో ఈనెల 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ డ్యాష్ బోర్డు నుంచి మాట్లాడతారని కలెక్టర్ షన్మోహన్ అన్నారు.
చిత్తూరు, మే 1: జిల్లాలో ఈనెల 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ డ్యాష్ బోర్డు నుంచి మాట్లాడతారని కలెక్టర్ షన్మోహన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. స్పందన అర్జీలతో రీ ఓపెన్కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలన్నారు. త్వరలో స్పందన అర్జీల పరిష్కారానికి అవసరమైన శిక్షణ కోసం వర్క్షాపును నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో రాజశేఖర్, సీఈవో ప్రభాకర్రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ విజయ్కుమార్రెడ్డి, పీఆర్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, ఆర్పీసీ ఆర్ఎం జితేంద్రనాథరెడ్డితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.