కర్ణాటక మద్యంతో పట్టుబడిన వలంటీరు
ABN , First Publish Date - 2023-12-05T00:41:40+05:30 IST
సెబ్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదకుప్పం గ్రామానికి చెందిన వలంటీర్ జ్యోతీశ్వరయ్య కర్ణాటక మద్యంతో పట్టుబడ్డాడు.
కారుస్వాధీనం.. నిందితుడి అరెస్టు
బంగారుపాళ్యం, డిసెంబరు 4: సెబ్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సదకుప్పం గ్రామానికి చెందిన వలంటీర్ జ్యోతీశ్వరయ్య కర్ణాటక మద్యంతో పట్టుబడ్డాడు. ట్రైనీఅసిస్టెంట్ ఎన్ఫోర్సుమెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, సెబ్ సీఐ చంద్రశేఖర్, సిబ్బందితో కలిసి సోమవారం బంగారుపాళ్యం మండలం అరగొండ రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. వీరిని గమనించి కారు డ్రైవర్ అతివేగంగా వెళ్లడంతో సెబ్ అధికారులు అనుమానించి.. ఆ కారును వెంబడించారు. అదుపులోకి తీసుకోని కారును తనిఖీ చేయగా 288 టెట్రాప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సదుకుప్పం గ్రామానికి చెందిన వలంటీరు జ్యోతీశ్వరయ్యను అదుపులోకి తీసుకున్నారు. కారునుస్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి నిందితుడ్ని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ మోహన్బాబు, హెడ్కానిస్టేబుల్ కృష్ణయ్య, సుబ్రహ్మణ్యంగౌడ్, మమత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.