కర్ణాటక మద్యం స్వాధీనం - ఒకరి అరెస్టు

ABN , First Publish Date - 2023-03-26T00:57:12+05:30 IST

అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబి సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

కర్ణాటక మద్యం స్వాధీనం - ఒకరి అరెస్టు

బంగారుపాళ్యం, మార్చి 25: అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబి సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. శనివారం మండల పరిధిలో ఆకస్మికంగా జరిపిన దాడుల్లో టేకుమంద క్రాస్‌ వద్ద బలిజపల్లెకు చెందిన చందు మహేష్‌ వద్ద కర్ణాటకకు చెందిన 41 టెట్రా పాకెట్ల మద్యం లభించింది. దానిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. దాడుల్లో ఎస్సై మోహన్‌బాబు, సిబ్బంది కృష్ణయ్య, సుబ్రమణ్యంగౌడ్‌, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-03-26T00:57:12+05:30 IST