నేను చిత్తూరోణ్ణి.. ఆదరించండి
ABN , First Publish Date - 2023-03-12T01:05:36+05:30 IST
చిత్తూరులో మిస్టర్ కళ్యాణ్ సినిమా హీరో కృష్ణ మాన్యం సందడి చేశారు. శనివారం ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఎంఎ్సఆర్ సిని మా థియేటర్కు ఆయనొచ్చారు.
చిత్తూరు రూరల్, మార్చి 11: చిత్తూరులో మిస్టర్ కళ్యాణ్ సినిమా హీరో కృష్ణ మాన్యం సందడి చేశారు. శనివారం ఈ సినిమా ప్రదర్శిస్తున్న ఎంఎ్సఆర్ సిని మా థియేటర్కు ఆయనొచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో మాట్లాడుతూ.. తాను చిత్తూరుకు చెందిన వాడినేనని చెప్పారు. ఇక్కడ చదువుకునేటప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు ఈ థియేటర్లోనే చూశానన్నారు. ఇపుడు తన సినిమా ఇదే హాల్లో ఆడుతుండడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆదరించాలని కోరారు. అనంతరం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం పలువురు అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.