ఘనంగా సాహితీ పురస్కారాలు
ABN , First Publish Date - 2023-03-31T01:04:18+05:30 IST
నగరంలోని సిఽంధూ టవర్స్లో కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
చిత్తూరు కల్చరల్, మార్చి 30: నగరంలోని సిఽంధూ టవర్స్లో కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారాల కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు కట్టమంచి బాలక్రిష్ణారెడ్డి, సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ కె.రామలక్ష్మి పాల్గొని సాహితీవేత్తలను ఘనంగా సత్కరించారు. ఇటివల కుప్పం రెడ్డెమ్మ సాహితీ పోటీలలో చందో, వచన, కథానికల పోటీలలో గెలుపొందిన ఆముదాల మురళి, నవజీవన్రెడ్డి, ఆర్.ఉమాదేవి, పి.ఝాన్సీలను నిర్వాహకులు రోజాప్రియా, నిరంజన్రెడ్డిలు రూ.10000నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన పలువురు కవులను సైతం ఘనంగా సత్కరించారు.