‘చంద్రప్రభ’పై వినాయకుడి విహారం

ABN , First Publish Date - 2023-10-04T00:54:25+05:30 IST

కాణిపాకం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా మంగళవారం వినాయకస్వామి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

‘చంద్రప్రభ’పై వినాయకుడి విహారం

ఐరాల(కాణిపాకం), అక్టోబరు 3: కాణిపాకం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా మంగళవారం వినాయకస్వామి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామికి ఉభయ వరస రావడంతో అలంకార మండపంలో ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. అనంతరం సిద్ధి, బుద్ధి పమేత వరసిద్ధుడి ఉత్సవర్లను చంద్రప్రభ వాహనంపై ఉంచి పురవీధులలో ఊరేగించారు. ఈ వాహన సేవకు కాణిపాకం, చినకాంపల్లె, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిగరపల్లె, తిరువణంపల్లె, బొమ్మసముద్రం, అగరంపల్లె, పుణ్యసముద్రం, మారేడుపల్లె, సంతపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన హరిజనులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదారులు ఆలయం నుంచి పాల కలశాలను తీసుకొని గ్రామం మొత్తం ఊరేగించారు. అనంతరం అలంకార మండపం వద్ద సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధునికి అభిషేకం నిర్వహించారు. చంద్రప్రభ వాహనాన్ని పురస్కరించుకొని విశ్రాంత ఏడీసీ జి.కేశవులు కుటుంబ సభ్యులతో కలిసి వరసిద్ధుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. అగరంపల్లెలోని తన స్వగృహం పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అధికారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈవో వెంకటేశు, ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెకర్లు బాబు, సురేష్‌, ఉభయదారులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు

బుధవారం స్వామికి కామధేను వాహన సేవ జరగనుంది. కాణిపాకానికి చెందిన నాయీబ్రహ్మణ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

Updated Date - 2023-10-04T00:54:25+05:30 IST