డీఎస్సీ 98 మెరిట్ జాబితా విడుదల
ABN , First Publish Date - 2023-04-12T02:10:51+05:30 IST
డీఎస్సీ-98 అభ్యర్థులకు 25 ఏళ్ల తర్వాత మినిమం టైం స్కేల్ కింద నియామకాలు చేపట్టారు.
నేడు, రేపు కౌన్సెలింగ్
చిత్తూరు (సెంట్రల్), ఏప్రిల్ 11: డీఎస్సీ-98 అభ్యర్థులకు 25 ఏళ్ల తర్వాత మినిమం టైం స్కేల్ కింద నియామకాలు చేపట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 553 మంది అభ్యర్థులతో కూడిన మెరిట్ జాబితాను మంగళవారం డీఈవో విజయేంద్రరావు విడుదల చేశారు. ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయని అభ్యర్థులు, 60 ఏళ్లు దాటిన అభ్యర్థులను తొలగించి మెరిట్ జాబితాను ప్రచురించారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మెరిట్ ప్రకారం 1 నుంచి 200 మందికి ఉదయం.. మధ్యాహ్నం 201 నుంచి 350 వరకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10 నుంచి 351 నుంచి 450.. మధ్యాహ్నం 451 నుంచి 553 వరకు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని డీఈవో తెలిపారు.