ఇన్చార్జి జేసీగా డీఆర్వో పెంచలకిషోర్
ABN , First Publish Date - 2023-12-11T01:04:24+05:30 IST
రెగ్యులర్ జేసీ వచ్చేవరకు ఇన్చార్జిగా డీఆర్వో పెంచలకిషోర్ కొనసాగనున్నారు.
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 10: జాయింట్ కలెక్టర్ (జేసీ) డీకే బాలాజీని రాష్ట్ర ప్రభుత్వం వైఎ్సఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్టు సీఈవోగా నియమించింది. దాంతో ఆదివారం ఆయన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. రెగ్యులర్ జేసీ వచ్చేవరకు ఇన్చార్జిగా డీఆర్వో పెంచలకిషోర్ కొనసాగనున్నారు. ఈ సందర్భంగా బాలాజి మాట్లాడుతూ.. సుమారు 20 నెలలపాటు శ్రీవారి చెంత పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లావాసులు మంచివారని, సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.