డిపో మేనేజర్లకు స్థానచలనం
ABN , First Publish Date - 2023-06-01T01:50:31+05:30 IST
నలుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లకు స్థానచలనం కల్పిస్తూ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు బుధవారం ఆదేశాలిచ్చారు.
తిరుపతి(కొర్లగుంట), మే 31 : నలుగురు ఆర్టీసీ డిపో మేనేజర్లకు స్థానచలనం కల్పిస్తూ ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు బుధవారం ఆదేశాలిచ్చారు. తిరుపతి కమర్షియల్(కార్గో) ఏటీఎంగా ఉన్న సుబ్బారావును పశ్చిమగోదావరి ఏటీఎం(కమర్షియల్)గా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్న ఆర్.సురేంద్రబాబును తిరుపతి కమర్షియల్(కార్గో) ఏటీఎంగా నియమించారు. కుప్పం డిపో మేనేజర్గా ఉన్న టి.కె.స్వామిని పలమనేరు డీఎంగా నియమించారు. వెంకటగిరి డిపో మేనేజర్గా ఉన్న ఎం.సి.పెంచలయ్యను కుప్పం డీఎంగా బదిలీ చేశారు. పలమనేరు డిపో మేనేజర్ రామకృష్ణను వెంకటగిరి డీఎంగా బదిలీ చేశారు.