రేపు తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో

ABN , First Publish Date - 2023-06-03T01:46:04+05:30 IST

టీటీడీ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఆదివారం తిరుమలలో జరుగనుంది.

రేపు తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో

తిరుమల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఆదివారం తిరుమలలో జరుగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈకార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం కానున్న ఈకార్యక్రమంలో భక్తులు తమ సందేహాలు, సూచనలు, ఫిర్యాదులపై టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డితో నేరుగా ఫోన్లో మాట్లాడవచ్చు. దీనికోసం భక్తులు 0877 2263261 నెంబరుకు ఫోన్‌ చేయాలి.

Updated Date - 2023-06-03T01:46:04+05:30 IST