కాణిపాకంలో అయ్యప్ప భక్తుల రద్దీ
ABN , Publish Date - Dec 17 , 2023 | 01:41 AM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో అయ్యప్పస్వామి భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతోంది.
ఐరాల(కాణిపాకం), డిసెంబరు 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో అయ్యప్పస్వామి భక్తుల భక్తుల రద్దీ కొనసాగుతోంది. శబరిమలైకి వెళ్లే భక్తులు కాణిపాకం విచ్చేసి వరసిద్ధుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. శనివారం కూడా వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు కాణిపాకం విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.