తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత
ABN , First Publish Date - 2023-03-26T02:25:31+05:30 IST
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శనివారం చిరుత సంచారం కలకలం సృష్టించింది.
తిరుమల, మార్చి25(ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శనివారం చిరుత సంచారం కలకలం సృష్టించింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో 34వ మలుపు వద్ద కాలువలో నీళ్లు తాగుతూ ఓ చిరుత వాహనదారులకు కనిపించింది. దీంతో తమ వాహనాలు నిలిపివేసిన వారు చిరుత అడవిలోకి వెళ్లిపోయాక బయల్దేరారు.కొంతకాలంగా ఇదే ప్రదేశంలో చిరుత పులులు వాహనదారుల కంటపడుతున్న విషయం తెలిసిందే.