చంద్రబాబు సీఎం కావాలని..!
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:29 AM
టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ మొగిలీశ్వరనగర్కు చెందిన శ్రీనివాసరావు గత 53రోజులుగా అయ్యప్ప దీక్ష చేసి, శనివారం కేరళలోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి చెల్లించారు.
బంగారుపాళ్యం, డిసెంబరు 30: టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ మొగిలీశ్వరనగర్కు చెందిన శ్రీనివాసరావు గత 53రోజులుగా అయ్యప్ప దీక్ష చేసి, శనివారం కేరళలోని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి చెల్లించారు. అనంతరం టీడీపీ జెండాను చేతబట్టి చంద్రబాబు సీఎం కావాలని మొక్కుకున్నారు.