భక్తజనసంద్రం ముక్కంటి ఆలయం

ABN , First Publish Date - 2023-08-22T00:09:08+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

 భక్తజనసంద్రం ముక్కంటి ఆలయం

శ్రీకాళహస్తి, ఆగస్టు 21: శ్రీకాళహస్తీశ్వరాలయం సోమవారం భక్తజనసంద్రంగా మారింది. సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సుమారు 30వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 582మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 1.135మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,432మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,013, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 267మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 230మంది, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 83మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 22,207 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - 2023-08-22T00:09:08+05:30 IST