పల్లికొండేశ్వరాలయ చైర్మన్‌గా బాలాజీరెడ్డి

ABN , First Publish Date - 2023-02-01T23:09:15+05:30 IST

ఎనిమిది మందితో పాలకమండలి

పల్లికొండేశ్వరాలయ చైర్మన్‌గా బాలాజీరెడ్డి

సత్యవేడు, ఫిబ్రవరి 1: నాగలాపురం మండలం సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్‌గా ఏవీఎం బాలాజీరెడ్డి(ముని చంద్రశేఖర్‌) నియమితులయ్యారు. ఆలయానికి ట్రస్టు బోర్డును నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా సత్యవేడు మండలం దాసుకుప్పం గ్రామానికి చెందిన బాలాజీరెడ్డి, సభ్యులుగా మునివేలు(సత్యవేడు), మంజుల(మదనపాళెం), అజయకుమార్‌ (బుచ్చినాయుడు కండ్రిగ), కవిత(కడూరు), సురేష్‌(నాగలాపురం), చిత్ర(సురుటుపల్లి), సత్య(సురుటుపల్లి), ఆనందుడు(ఎస్‌ఎస్‌పురం), ఎక్స్‌ అఫిషియో సభ్యుడుగా ఆలయ ప్రధాన అర్చకులు కార్తీకేయన్‌ నియమితులయ్యారు.

Updated Date - 2023-02-01T23:12:08+05:30 IST