Share News

తెలుగు యువత నేతపై మరో కేసు

ABN , Publish Date - Dec 26 , 2023 | 11:28 PM

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిపై మరో కేసు నమోదైంది. గతంలో గూడూరు వద్ద నేషనల్‌ హైవేని దిగ్బంధించారంటూ అక్కడి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం పరిధిలో నివాసం ఉంటున్న రవినాయుడు ఇంటికి మంగళవారం గూడూరు నుంచి వచ్చిన పోలీసులు 41 నోటీసు అందజేశారు.

తెలుగు యువత నేతపై మరో కేసు
రవినాయుడికి నోటీసు ఇచ్చిన పోలీసు

41 నోటీసు ఇచ్చిన గూడూరు పోలీసులు

తిరుపతి (రవాణా), డిసెంబరు 26: తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిపై మరో కేసు నమోదైంది. గతంలో గూడూరు వద్ద నేషనల్‌ హైవేని దిగ్బంధించారంటూ అక్కడి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి మంగళం పరిధిలో నివాసం ఉంటున్న రవినాయుడు ఇంటికి మంగళవారం గూడూరు నుంచి వచ్చిన పోలీసులు 41 నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూసిన ఏ ప్రభుత్వమూ చరిత్రలో మనుగడ సాగించినట్లు లేదని చెప్పారు. జగన్‌ను గద్దె దించేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన నేపథ్యంలో రవినాయుడిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Updated Date - Dec 26 , 2023 | 11:28 PM