మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
ABN , First Publish Date - 2023-06-07T00:17:26+05:30 IST
మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు.
శ్రీరంగరాజపురం, జూన్ 6: మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఎస్ఆర్పురం మండలంలోని 49. కొత్లపల్లెమిట్ట మామిడి కొనుగోలు రాంపులు, మామిడి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 49 కొత్తపల్లెమిట్టలోని 8 రాంపులు ఉన్నాయి, కొనుగోలు దారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని, సమాచారంలో జిల్లా మామిడి రైతుల సంఘం నాయకులు రైతులతో కలసి రాంప్ వద్ద కొనుగోలుదారులను కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీ 15 రూపాయలకు తగ్గకుండా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గాండ్ల సంఘం డైరెక్టర్, మాజీ ఎంపీపీ పురుషోత్తం, మండల రైతు అధ్యక్షుడు ఉమాచందర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, రైతులు నాగారాజురెడ్డి, సురేంద్రరెడ్డి, త్యాగరాజులు తదితరులు పాల్గొన్నారు.