చోరీ కేసు ఛేదనకు 4 బృందాలు
ABN , First Publish Date - 2023-11-06T00:52:04+05:30 IST
చిత్తూరు నగరంలో శనివారం కీర్తన గోల్డ్ లోన్స్ సంస్థకు చెందిన రూ.22 లక్షల విలువైన బంగారం చోరీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఛేదించేందుకు గాను ఎస్పీ రిషాంత్రెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.
చిత్తూరు, నవంబరు 5: చిత్తూరు నగరంలో శనివారం కీర్తన గోల్డ్ లోన్స్ సంస్థకు చెందిన రూ.22 లక్షల విలువైన బంగారం చోరీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఛేదించేందుకు గాను ఎస్పీ రిషాంత్రెడ్డి నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ చోరీ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ బృందాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్లి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నారు.