బంగారుపాళ్యం మార్కెట్కు 300 టన్నుల మామిడి
ABN , First Publish Date - 2023-04-24T00:56:34+05:30 IST
బంగారుపాళ్యం మండలంలో శనివారం సాయంత్రం కురిసిన గాలివానకు మామిడికాయలు నేలరాలాయి.
బంగారుపాళ్యం, ఏప్రిల్ 23: బంగారుపాళ్యం మండలంలో శనివారం సాయంత్రం కురిసిన గాలివానకు మామిడికాయలు నేలరాలాయి. మండలంలోని తుంబకుప్పం, నల్లంగాడు, ఎన్.కోటూరు, సదకుప్పం, పెరుమాళ్ళపల్లి, తూంపాయనపల్లి, తుంబపాళ్యం, వంకరవారిపల్లె, కచ్చేటివారిపల్లె, బొమ్మాయపల్లి, కరిడివారిపల్లెల్లోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదివారం బంగారుపాళ్యం మార్కెట్కు సుమారు 300 టన్నుల రాలిన మామిడిని తరలించగా, కేజీ ధర రూ.6 పలికింది. మామిడి వ్యాపారులు కొనుగోలుచేసి చెన్నై, బెంగళూరు, సేలం తదితర ప్రాంతాలకు బస్తాల ద్వారా తరలించారు. ఈ అకాల గాలివాన వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.