జేఈఈ మెయిన్స్కు 18మంది గైర్హాజరు
ABN , First Publish Date - 2023-01-26T02:50:36+05:30 IST
ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే మొదటిదశ జేఈఈమెయిన్స్ ఆన్లైన్ పరీక్షలకు రెండవరోజు బుధవారం ఉమ్మడిచిత్తూరు జిల్లాలో 18మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ పి.సింధు పేర్కొన్నారు.
తిరుపతి(విద్య),జనవరి25: ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జరిగే మొదటిదశ జేఈఈమెయిన్స్ ఆన్లైన్ పరీక్షలకు రెండవరోజు బుధవారం ఉమ్మడిచిత్తూరు జిల్లాలో 18మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ పి.సింధు పేర్కొన్నారు.తిరుపతిలో చెర్లోపల్లెలో ఉన్న ఐయాన్డిజిటల్జోన్ కేంద్రంలో 1840మందికిగా 1824మంది విద్యార్థులు వచ్చి పరీక్ష రాయగా..16మంది విద్యార్థులు హాజరుకాలేదని తెలిపారు. చిత్తూరులోని సీతమ్స్ కేంద్రంలో 190మందికిగాను 188మంది విద్యార్థులు హాజరవ్వగా..ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు.