అవి రెండూ రాయలసీమకు ఉరితాడు లాంటివి: బైరెడ్డి

ABN , First Publish Date - 2023-05-11T14:06:14+05:30 IST

రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

అవి రెండూ రాయలసీమకు ఉరితాడు లాంటివి: బైరెడ్డి

కర్నూలు : రాయలసీమ కర్తవ్య దీక్షను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. రాయలసీమలోని 8 జిల్లాలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. రాయలసీమ యువత ఉన్నత చదువులు చదివి ఇతర రాష్ట్రాలలో కూలి పని చేస్తున్నారన్నారు. అప్పర్ భద్ర, తీగల వంతెన ఈ రెండు రాయలసీమకు ఉరితాడు లాంటివన్నారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ రాయలసీమకు ఎంతో ముఖ్యమైనదని.. దీని గురించి ఎవరూ మాట్లాడరన్నారు. 70 నుంచి 80 టీఎంసీల రిజర్వాయరు తమకు కావాలని బైరెడ్డి అన్నారు.

‘‘చిల్లర ప్రాజెక్టులు చూపించి రాయలసీమకు ఏదో చేస్తున్నట్లు చెబుతున్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చారా..? రాయలసీమ విషయంలో జగన్ మైండ్ పనిచేయడం లేదు. రాయలసీమ పట్ల జగన్ కు చిత్తశుద్ధి లేదు. రాయలసీమను అంటరాని వారుగా మార్చారు ఇక్కడి నాయకులు. రాయలసీమ ప్రజల్లో చైతన్యం తేవడానికి 14వ తేదీ నుంచి 21 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించ బోతున్నాం. సంతకాల సేకరణ అనంతరం ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం. రెండో దశ ఉద్యమంలో భాగంగా ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తాం’’ అని బైరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-05-11T14:06:14+05:30 IST