CM Jagan : జగన్ పర్యటన నేపథ్యంలో బుగ్గన సమీక్ష

ABN , First Publish Date - 2023-09-16T13:03:18+05:30 IST

సెప్టెంబర్ 19వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు.

CM Jagan : జగన్ పర్యటన నేపథ్యంలో బుగ్గన సమీక్ష

కర్నూలు : సెప్టెంబర్ 19వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష నిర్వహించారు. 77 చెరువులకు కృష్ణా జలాలు అందించే 'హంద్రీనీవా' సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం వచ్చే మంగళవారం సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుందన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో సమావేశమై పోలీస్ గెస్ట్ హౌస్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్షించారు.

Updated Date - 2023-09-16T13:03:18+05:30 IST