భూసార పరీక్షా పరికరాలకు టెండర్లు

ABN , First Publish Date - 2023-03-31T04:05:45+05:30 IST

ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో భూసార పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్‌ వ్యవసాయ శాఖను ఆదేశించారు.

భూసార పరీక్షా పరికరాలకు టెండర్లు

సీఎం జగన్‌ ఆదేశాలు బుట్టదాఖలు

అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఏటా మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో భూసార పరీక్షలను నిర్వహించాలని సీఎం జగన్‌ వ్యవసాయ శాఖను ఆదేశించారు. కానీ భూసార పరీక్షా పరికరాల కోసం వ్యవసాయ శాఖ మార్చి నెల ముగుస్తుండగా, ఇప్పుడు టెండర్లు పిలుస్తోంది. ఈనెల 28న టెండర్‌ బిడ్‌లను ఆహ్వానించిన అధికారులు శుక్రవారం ప్రీబిడ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. టెక్నికల్‌ బిడ్‌ సమర్పించడానికి ఏప్రిల్‌ 5ను తుది గడువుగా నిర్ణయించారు. సాంకేతికంగా అర్హత పొందిన బిడ్లను 8న ప్రకటిస్తారు. వారు ఈ ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా ఫైనాన్షియల్‌ బిడ్‌లను 10లోగా సమర్పించాలని నిర్ణయించారు. ఈ బిడ్‌లకు రివర్స్‌ ఆక్షన్‌ విధానాన్ని అనుసరించనున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. టెండర్లు దక్కించుకున్న బిడ్డర్లు రాష్ట్రవ్యాప్తంగా 127 అగ్రి ల్యాబ్‌లకు భూసార పరీక్షా పరికరాలను సొంత చార్జీలతో సరఫరా చేయాలని టెండర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-31T04:05:45+05:30 IST