నేడు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
ABN , First Publish Date - 2023-03-31T03:34:21+05:30 IST
నేడు టీడీపీ ఎమ్మెల్సీల ప్రమాణం
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పట్టభద్ర, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన నలుగురు టీడీపీ అభ్యర్థులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్టభద్ర ఎన్నికల్లో వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేల కోటా నుంచి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.