AP Govt: మరో మూడు వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ సర్కార్
ABN , First Publish Date - 2023-06-06T15:53:57+05:30 IST
ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు తీసుకొచ్చింది. తాజాగా మరో 3 వేల కోట్ల అప్పును ఏపీ సర్కార్ తీసుకుంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం (AP Government) మరోసారి అప్పు తీసుకొచ్చింది. తాజాగా మరో 3 వేల కోట్ల అప్పును ఏపీ సర్కార్ తీసుకుంది. వెయ్యి కోట్లు 14 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో రుణం పొందింది. రూ. 500 కోట్లు 10 సంవత్సరాలకు 7.33 శాతం, మరో రూ. 500 కోట్లు 19 సంవత్సరాలకు 7.33 శాతం వడ్డీతో రుణం తీసుకుంది. ఈ 3 వేల కోట్లతో ఎఫ్ఆర్బీఎం పరిమితిలోని అప్పులు 18 వేల 500 కోట్లకు చేరుకున్నాయి. కేవలం 65 రోజులు వ్యవధిలో 18 వేల 500 కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చింది. ఎఫ్ఆర్బీఎంలో ఇంకా కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే మిగులు ఉంది. మరోవైపు నేటికీ రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో పడని పరిస్థితి. ఈ 3 వేల కోట్ల రూపాయలు ఖజానాలో జమైతే పూర్తి స్థాయిలో వేతనాలు, పెన్షన్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.