మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-06-01T00:32:55+05:30 IST

పట్టణంలోని పీఅండ్‌టీ కాలనీలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి రాము భార్య రుక్మిణీ(25) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పా ల్పడినట్లు వనటౌన పోలీసులు తెలిపారు.

మహిళ ఆత్మహత్య

గుంతకల్లుటౌన, మే 31: పట్టణంలోని పీఅండ్‌టీ కాలనీలో నివాసముంటున్న రైల్వే ఉద్యోగి రాము భార్య రుక్మిణీ(25) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పా ల్పడినట్లు వనటౌన పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుం తకల్లు రైల్వే డివిజనలో ఎలకి్ట్రకల్‌ డిపార్ట్‌మెంట్‌లో రాము జేఈగా విధులు నిర్వహి స్తున్నాడు. ఉదయం రాము డ్యూటీకి వెళ్లడంతో రుక్మిణీ ఫ్యానకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. పక్కింటి వారు గమనించి వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం రైల్వే ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందిన ట్లు వైద్యులు ధ్రువీకరించారు. రుక్మిణీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తామని పోలీసులు తెలిపారు. రుక్మిణీ మృతికి కారణాలు పోలీసుల విచారణ లో తెలియాల్సి ఉంది. మృతిరాలికి రెండు సంవత్సరాల పాప ఉంది.

Updated Date - 2023-06-01T00:32:55+05:30 IST