రొద్దంలో బస్సుయాత్రకు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2023-06-26T01:02:24+05:30 IST

మండల పరిధిలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రకు ఘనస్వాగతం లభించింది.

రొద్దంలో బస్సుయాత్రకు ఘనస్వాగతం

రొద్దం, జూన 25 : మండల పరిధిలో జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రకు ఘనస్వాగతం లభించింది. రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నం గ్రామంలోకి ఆదివారం సాయంత్రం 5గంటలకు బస్సు యాత్ర రాగా స్థానిక నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అలాగే బాలన్నపల్లి, పెద్దకోడిపల్లి మీదుగా బస్సుయాత్ర సాగింది. రొద్దంలో పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. చిన్నమం తూరులో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు పట్టారు. చెరుకూరు, పెద్దమంతూరు రొప్పాల, కలిపి, మరువపల్లి గ్రామాల మీదుగా పరిగి మండలంలోకి బస్సు యాత్ర వెళ్లింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బీటీ నాయుడు, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, నిమ్మలకిష్టప్ప, తిప్పేస్వామి, సవిత, అంబికా లక్ష్మీనారా యణ, సుబ్బరత్నమ్మ, నరసింహులు, క్రిష్ణమూర్తి, పవన, హరి, తురకలాపట్నం నాగేంద్ర, మురళి, చిన్నమంతూరు ఎర్రిస్వామి, వాణి, పవన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T01:02:24+05:30 IST