వైకుంఠవాసా. పాహిమాం!
ABN , Publish Date - Dec 24 , 2023 | 12:41 AM
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వైష్ణవాలయాల్లో శనివారం వేకువజాము నుంచే స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు.
భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పర్వదినం
ఉత్తర ద్వార దర్శనంతో భక్తుల తన్మయత్వం
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వైష్ణవాలయాల్లో శనివారం వేకువజాము నుంచే స్వామివారి ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతపురంలోని పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం, రామ్నగర్ వెంకటేశ్వర ఆలయం, హౌసింగ్ బోర్డు, ఆర్ఎఫ్ రోడ్డు లక్ష్మీ వెంకటేశ్వర ఆలయాలు, మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం తదితర ప్రాంతాలలో వేలాది మంది భక్తులు క్యూలో నిలబడ్డారు. ఉత్తర ద్వారంగుండా వైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. - అనంతపురం కల్చరల్