న్యాయ సేవలు వినియోగించుకోండి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:14 AM
శాశ్వ త లోక్అదాలతలో ఉచిత ప్రజాప్రయోజన న్యాయసేవలు ప్రజలు వినియోగించుకోవాలని చైర్మన శ్రీనివాసరావు కోరారు.
అనంతపురం క్లాక్టవర్, డిసెంబరు 16: శాశ్వ త లోక్అదాలతలో ఉచిత ప్రజాప్రయోజన న్యాయసేవలు ప్రజలు వినియోగించుకోవాలని చైర్మన శ్రీనివాసరావు కోరారు. శనివారం స్థానిక అర్బన బ్యాంకులో ప్రజా వినియోగసేవల కోసం శాశ్వత లోక్ అదాలత నిర్వహించారు. చైర్మన మాట్లాడుతూ అనేక తగాదాలలో కోర్టులో వచ్చిన కేసుల్లో సత్వర పరిష్కార మార్గం కోసం శాశ్వత లోక్ అదాలత ద్వారా న్యాయం లభిస్తుందనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎటువంటి రుసుం చెల్లించకుండా సహజ న్యాయసూత్రాల ఆధారంగా ఉచితంగా న్యాయం పొందొచ్చని వివరించారు. ప్రభుత్వ సంస్థల్లో, వివిధ శాఖలు, బ్యాంకింగ్, బీమా రంగాలలో నెలకొన్న కేసులలో 60రోజులలో పరిష్కారానికి మార్గం చూపుతామన్నారు. కార్యక్రమంలో అర్బన బ్యాంకు చైర్మన జేఎల్ మురళీధర్, సీఈఓ విజయబాస్కర్, డైరెక్టర్లు పాల్గొన్నారు.