ద్విచక్రవాహనం ఢీ - మహిళ మృతి

ABN , First Publish Date - 2023-05-31T23:44:10+05:30 IST

స్థానిక బస్టాండ్‌ వద్ద బుధవారం ద్విచక్రవాహ నం ఢీకొని తిమ్మగానిపల్లికి చెందిన ఆనందమ్మ(47) మృతిచెందింది.

ద్విచక్రవాహనం ఢీ - మహిళ మృతి

లేపాక్షి, మే 31: స్థానిక బస్టాండ్‌ వద్ద బుధవారం ద్విచక్రవాహ నం ఢీకొని తిమ్మగానిపల్లికి చెందిన ఆనందమ్మ(47) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలివి. ఆనందమ్మ బస్టాండ్‌ వద్ద రోడ్డు దా టుతుండగా, హిందూపురం వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం వేగంగా ఢీకొంది. కిందపడిపోయిన ఆనందమ్మకు తీవ్రగాయాలు కాగా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందు తూ మృతి చెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-05-31T23:44:10+05:30 IST