కమ్మవారిపల్లి ప్రమాదంలో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2023-03-25T00:09:03+05:30 IST
పట్టణంలోని కమ్మవారిపల్లి రహదారిలో టీటీడీ కళ్యాణ మంటపం వద్ద శుక్రవారం ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో సిరిగమవాండ్లపల్లి చెందిన నరేష్(31), కమ్మవా రిపల్లికి చెందిన మురళి (18) మృతి చెందాడు.
గోరంట్ల, మార్చి 24: పట్టణంలోని కమ్మవారిపల్లి రహదారిలో టీటీడీ కళ్యాణ మంటపం వద్ద శుక్రవారం ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో సిరిగమవాండ్లపల్లి చెందిన నరేష్(31), కమ్మవా రిపల్లికి చెందిన మురళి (18) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరా లివి. కమ్మవారిపల్లికి చెందిన నరసింహులు, మురళి ద్విచక్రవాహనంలో వెళ్తుండగా, సిరిగమవాండ్లపల్లికి చెందిన నరేష్ మరో ద్విచక్రవాహనంలో వస్తూ ఎదురెదురుగా ఢీకొన్నారు. ఘటనలో ముగ్గురూ గాయపడగా, గో రంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరేష్, మురళి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు, ద్విచక్రవాహనం ఢీ - ఒకరి మృతి
పెనుకొండ రూరల్, మార్చి 24: మండలంలో ని గోనిపేట బ్రిడ్జి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నా యి. ప్రమాదంలో శ్రీనివాసులు(50) మృతి చెందా డు. హెడ్ కానిస్టేబుల్ దాదాపీర్ తెలిపిన వివరా లివి. పరమేశ్వరపురానికి చెందిన శ్రీనివాసులు ద్వి చక్రవాహనంలో పెనుకొండ వైపునకు వస్తూ గోనిపేట బ్రిడ్జి వద్ద రోడ్డు క్రాస్ అవుతుండగా, అనంతపురం వైపు వెళ్లే కారు ఢీకొంది. ప్రమాదంలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 అంబులెన్సలో పెనుకొం డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.