Share News

వైసీపీ ప్రభుత్వం అన్నింటా విఫలం

ABN , First Publish Date - 2023-11-20T23:50:18+05:30 IST

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మండిపడ్డారు.

 వైసీపీ ప్రభుత్వం అన్నింటా విఫలం
అనంతపురంలో ప్రజలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన, నవంబరు 20: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మండిపడ్డారు. సోమవారం అనంతపురం అర్బన పరిధిలోని 39వ డివిజనలో బాబు ష్యూరిటీ - భవిష్యతకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు సీఎం అయితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నటేష్‌ చౌదరి, చేపల హరి, బంగి నాగ, ముక్తియార్‌, గుర్రం నాగభూషణం, పీఎం లక్ష్మీప్రసాద్‌, గోపాల్‌ గౌడ్‌, బాలప్ప, చెరుకుతోట పవనకుమార్‌, కడియాల కొండన్న, గంగవరం అంజి, తెలుగు మహిళలు శివబాల, జానకి, కృష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T23:50:19+05:30 IST