Share News

భవన నిర్మాణ కార్మికుల బతుకులు కుదేలు

ABN , First Publish Date - 2023-11-22T00:04:14+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవితా లు కుదేలవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు.

 భవన నిర్మాణ కార్మికుల బతుకులు కుదేలు
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సవిత

వైసీపీ పాలనపై సవిత విమర్శ

పెనుకొండ టౌన, నవంబరు 21 : ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ పాలనలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల జీవితా లు కుదేలవుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత దుయ్యబట్టారు. ఆమె మంగళవారం పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ... రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి రంగంలో భవన నిర్మాణరంగం మూడో స్థానంలో ఉందన్నారు. దాదాపు 60లక్షల మంది ఈ రంగం ద్వారా జీవనో పాధి పొందుతున్నారన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక, సిమెంటు తదితర భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెంచడంతో నిర్మాణాలు జరుగక 70శాతం మంది పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వారు చాలామంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందుతున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికుల జీవితాల్లో మబ్బులు నింపిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుట్టూరు సూరి, మండల మాజీ కన్వీనర్‌ శ్రీరాములు, త్రివేంద్ర, వాసుదేవరెడ్డి, బాబుల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-22T00:04:17+05:30 IST