స్పీకర్ వ్యాఖ్యల వెనుక కుట్రకోణం
ABN , First Publish Date - 2023-06-01T00:34:54+05:30 IST
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఫినిస్ చేస్తామని వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని టీడీపీ మండల కన్వీనర్ నూతేటి వెంకటేష్ పేర్కొన్నారు
ఉరవకొండ, మే 31: శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఫినిస్ చేస్తామని వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని టీడీపీ మండల కన్వీనర్ నూతేటి వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ రాజ్యాంగబదఽ్దమైన పద విలో ఉన్న స్పీకర్, ఒక గుండాలా మాట్లాడు తున్నారన్నారు. రాజకీయంగా ప్రోత్సహించిన టీడీపీ పైనే అతని వ్యాఖ్యలు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందన్నారు. చంద్రబాబు, టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు మతిభ్రమించి ఇష్టారాజ్యంగా మాట్లాడు తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన భద్రత లేకుండా ప్రజల్లో తిరిగే ద మ్ముందా అని ప్రశ్నించారు. 2024లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. నాలుగేళ్లలో వైసీపీ ప్రభత్వం రాష్ర్టాన్ని సర్వ నాశనం చేసిందన్నారు. నాలుగేళ్ల పాల నలో ప్రజా వేదిక కూల్చడం, బీసీ లపై కేసులు నమోదు చేయడం తప్పా ఏమి సాధించారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వన్నూరుస్వామి, నాగన్న, చల్లా అనంత య్య, ఎర్రి స్వామి, గుర్రప్ప, రామస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.