నీటి తొట్టెలో పడి బాలుడి మృతి
ABN , First Publish Date - 2023-03-31T00:19:10+05:30 IST
వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి తండాలో పండుగ పూట విషాదం నెలకొంది.
వజ్రకరూరు(ఉరవకొండ), మార్చి 30: వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి తండాలో పండుగ పూట విషాదం నెలకొంది. కుమార్నాయక్, లక్ష్మీబాయి దంపతుల కుమారుడు అకిరానందన (2) ఆడుకుంటూ వెళ్లి ప్ర మాదవశాత్తు నీటి తొట్టెలో పడి పోయాడు. బాలుడు ఎంతసేపటికి కనిపిం చకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల గాలించారు. నీటి తొట్టెలో పడి ఉండటం గమనించిన కుటుంబసభ్యులు బయటకు తీసి 108 వాహనానికి సమాచారాన్ని అందించారు. బాలుడిని హుటాహుటిన ఉరవ కొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.