నల్లబెలూన్లతో టీడీపీ నిరసన
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:34 AM
అనంతలో వైసీపీ చేపట్టిన సామా జిక సాధికార బస్సు యాత్రకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నల్లబెలూన్లను గాల్లోకి వదిలేసి నిరసన వ్యక్తం చేశారు
అనంతపురం అర్బన, డిసెంబరు 29: అనంతలో వైసీపీ చేపట్టిన సామా జిక సాధికార బస్సు యాత్రకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నల్లబెలూన్లను గాల్లోకి వదిలేసి నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం అనంతపురం అర్బనలోని రాంనగర్లో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీల ద్రోహి సీ ఎం జగన అంటూ నినదించారు. కార్యక్రమంలో నాయకులు దేవళ్ల మురళీ, గోపాల్ గౌడ్, పోతుల లక్ష్మీనరసింహులు, సైఫుద్దీన, జేఎం బాషా, రఫిక్ అహ్మద్, శ్రీనివాస్గౌడ్, రవికుమార్ చౌదరి, మహిళలు విజయశ్రీరెడ్డి, సరళ పాల్గొన్నారు.