బడుగు, బలహీనవర్గాల ద్రోహి వైసీపీ

ABN , First Publish Date - 2023-02-06T23:40:26+05:30 IST

వైసీపీ.. బడుగు, బలహీనవర్గాలకు అన్నిరకాలా అన్యాయం చేసి, ద్రోహిగా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు.

బడుగు, బలహీనవర్గాల ద్రోహి వైసీపీ
ఇదేం ఖర్మ పోస్టరును చూపుతున్న బీకే, నాయకులు

బీకే పార్థసారథి ధ్వజం

రొద్దం, ఫిబ్రవరి 6: వైసీపీ.. బడుగు, బలహీనవర్గాలకు అన్నిరకాలా అన్యాయం చేసి, ద్రోహిగా మారిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ధ్వజమెత్తారు. సోమవారం మండలంలోని రొప్పాల, కొత్తపల్లి గ్రామాల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీకే మాట్లాడుతూ.. బీసీ సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం నయాపైసా ఇవ్వకుండా బీసీ ద్రోహిగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన నిధులను పక్కదారి పట్టించిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. బీసీ కులాలకు చైర్మనను నియమించి, ఉత్సవ విగ్రహాలుగా మార్చిందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రతి బీసీ కులానికి రూ.వేలకోట్లు కేటాయించి, సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. పి.కొత్తపల్లి, రొప్పాల గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ హయాంలో 25 ట్రాక్టర్లు పెట్టుకుని, ఇసుక అమ్ముకుని, బాగుపడగా.. ఇప్పుడు వాటిని అమ్ముకుని రోడ్డున పడ్డారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేసేవారికే ప్రజలు మద్దతు తెలపాలని బీకే కోరారు. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:40:29+05:30 IST