ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN , First Publish Date - 2023-02-06T23:50:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

 ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

టీడీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్‌ సూచన

ధర్మవరం రూరల్‌, ఫిబ్రవరి 6: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఽసోమవారం ధర్మవరం మండలానికి చెందిన పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్రను ధర్మవరం నియోజకవర్గంలో విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి 50 ఇళ్లకు ఓ సెక్షన ఇనచార్జ్‌ను నియమించాలని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జ్‌ మహే్‌షచౌదరి, మండల కన్వీనర్‌ పోతుకుంట లక్ష్మన్న, మాజీ జడ్పీటీసీ మేకలరామాంజనేయులు, నాయ కులు గొట్లూరుశ్రీనివాసులు, సర్పంచ ముత్యాలప్పనాయుడు, విజయ సారథి, రాంపురం శీనా, చిగిచెర్ల రాఘవరెడ్డి, జంగం నరసింహులు, గొట్లూరు నారాయణస్వామి, అనిల్‌, చిరంజీవి, అమరేంద్ర, పోతుకుంట రమేష్‌, ఏలుకుంట్ల రమణ, మోపూరి రామ్మోహన, రమణమోహన, నేలకోట రామ్మోహనరెడ్డి, కొమ్మినేని సూరి, మల్లేనిపల్లి చంద్ర, గరుడంపల్లి అంజి, చండ్రాయుడు, కాశెప్ప, తాతిరెడ్డి, ఆదెప్ప, నరేష్‌, పురుషోత్తం, బడన్నపల్లి క్రిష్ట, జనార్దన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:50:31+05:30 IST