Share News

ఎస్కేయూ డిగ్రీ ఫరీక్షా ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-11-10T00:13:42+05:30 IST

ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలను పరీక్షల నిర్వహణ విభాగాధిపతి ప్రొఫెసర్‌ జీవీ రమణ ఆధ్వర్యంలో వీసీ రామకృష్ణారెడ్డి గురువారం విడుదల చేశారు.

ఎస్కేయూ డిగ్రీ ఫరీక్షా ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ రామకృష్ణారెడ్డి

అనంతపురం సెంట్రల్‌, నవంబరు 9: ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలను పరీక్షల నిర్వహణ విభాగాధిపతి ప్రొఫెసర్‌ జీవీ రమణ ఆధ్వర్యంలో వీసీ రామకృష్ణారెడ్డి గురువారం విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ జూలై, ఆగస్టులో బీఏ, బీబీఏ, బీసీఏ, బీకామ్‌, బీఎస్సీ విద్యార్థులకు ద్వితీయ, నాల్గవ సెమిస్టర్‌ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించామన్నారు. ద్వితీయ సెమిస్టర్‌ పరీక్షలకు 10,496 మంది విద్యార్థులు 24,381 పేపర్లు రాయగా 12,477 పేపర్లు పాసైనట్లు తెలిపారు. నాల్గో సెమిస్టర్‌కు 8,317 మంది విద్యార్థులు 20,625 పేపర్లకుగాను 11,542 పేపర్లు పాస్‌ అయ్యారన్నారు. రీవాల్యుయేషన, పర్సనల్‌ వెరిఫికేషనకు ఈ నెల 24లోపు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున ఫీజు చెల్లించాని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ ఎంవీ లక్ష్మయ్య, కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స డాక్టర్‌ శ్రీరాములు నాయక్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ చండ్రాయుడు, ప్రిన్సిపాల్‌ క్రిష్ణకుమారి, ప్రొఫెసర్‌ రామగోపాల్‌, లా విభాగాధిపతి శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T00:13:43+05:30 IST