భూ రిజిసే్ట్రషన చార్జీలు తగ్గించాలని నిరసన

ABN , First Publish Date - 2023-06-07T00:36:10+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిసే్ట్రషన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డాక్యుమెంటరీ రైటర్ల ఆధ్వర్యంలో సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ

భూ రిజిసే్ట్రషన చార్జీలు తగ్గించాలని నిరసన
సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రియల్‌ వ్యాపారులు

గుత్తి, జూన 6: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రిజిసే్ట్రషన చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డాక్యుమెంటరీ రైటర్ల ఆధ్వర్యంలో సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇళ్లు, స్థలాల రిజిసే్ట్రషన చార్జీలను పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడం దారుణమని అన్నారు. ప్రభుత్వ మార్కెట్‌ విలువ కంటే అధిక రేట్లు పెంచిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిసే్ట్రషన చార్జీలు తగ్గించేవరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. కార్యాలయంలోకి చొరబడి బైఠాయించారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే సోమవారం నుంచి రిజిసే్ట్రషన చార్జీలు పెరిగిన గ్రామాలకు రిజిసే్ట్రషన చేయబోమని, మిగిలిన గ్రామాలకు చేస్తామని సబ్‌ రిజిసా్ట్రర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2023-06-07T00:36:10+05:30 IST