వార్డులో సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-06-01T00:04:33+05:30 IST
తమ వార్డులోని సమస్యలను పరిష్క రించాలని కోరుతూ పట్టణంలోని 10వ వార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ కేఎస్ దిల్షాదున్నీషా నిరసన తెలిపా రు.
నేలపై కూర్చొని కౌన్సిలర్ నిరసన
కదిరి అర్బన, మే 31: తమ వార్డులోని సమస్యలను పరిష్క రించాలని కోరుతూ పట్టణంలోని 10వ వార్డుకు చెందిన వైసీపీ కౌన్సిలర్ కేఎస్ దిల్షాదున్నీషా నిరసన తెలిపా రు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బుధవారం చైర్పర్సన నిజాము న్నీషా అధ్యక్షతన కౌన్సిల్ సమా వేశం నిర్వహించారు. తమ వార్డు సమస్యలు తీర్చాలని వైసీపీ కౌన్సిలర్ దిల్షాదున్నీషా కౌన్సిల్ సమావేశం ఎదుట నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంత వరకు తమ వార్డు లో ఒక్క రూపాయి అభివృద్ధి పనులు కూడా చేయలేదన్నారు. సిమెం టు రోడ్లు, మురుగునీటి కాలువలు, కల్వర్టులు నిర్మించాలని డి మాండ్ చేశారు. తాగునీటి పైపులు పగిలిపోయి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందన్నారు. తన వార్డులోని ఇద్దరు వలంటీర్లను ఉద్దేశ్యపూ ర్వకంగానే తొలగించారని ఆరోపించారు. తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. కమిషనర్ శ్రీహరిబాబు స్పందిస్తూ కౌన్సిల్ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.